అరటితోట దగ్ధం..రూ.5 లక్షలు ఆస్తినష్టం

28 Feb, 2017 01:19 IST|Sakshi
ముదిగుబ్బ (ధర్మవరం) : ముదిగుబ్బ మండల పరిధిలోని దొరిగిల్లులో దివాకర్‌రెడ్డి అనే రైతుకు చెందిన అరటితోటలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగి, పూర్తిగా కాలిపోయింది. బాధిత రైతు తహసీల్దార్‌ పీవీ రమణకు వినతిపత్రం అందజేశాడు. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 లక్షలు పంట నష్టం వాటిల్లినట్లు రైతు పేర్కొన్నాడు. పంటను పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ రైతుకు హామీ ఇచ్చారు. 
 
మరిన్ని వార్తలు