ఆరు ఎకరాల్లో అరటితోట దగ్ధం

28 Feb, 2017 01:17 IST|Sakshi
పుట్లూరు : మండలంలోని ఓబుళాపురం గ్రామ సమీపంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో  ఆరు ఎకరాల్లో సాగు చేసిన అరటితోట దగ్ధమైంది. చాగంటి పుల్లారెడ్డి అనే రైతుకు చెందిన అరటితోటకు మంటలు వ్యాపించడంలో సమీప పొలాల్లోని రైతులు ఫైరింజి¯ŒS సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజి¯ŒS వచ్చేలోపు అరటితోట దగ్ధమైంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 టన్నుల అరటిగెలలు కాలిపోయాయి. డ్రిప్పు పరికరాలు బూడిద కావడంతో రూ.6 లక్షల మేరకు నష్టం జరిగినట్లు బాధిత రైతు వాపోయాడు. 
మరిన్ని వార్తలు