బ్యాడ్మింటన్‌ మహిళల డబుల్స్‌ విజేత ‘పశ్చిమ’

1 Sep, 2016 00:58 IST|Sakshi
ప్రొద్దుటూరు కల్చరల్‌ : రాష ్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ మహిళల డబుల్స్‌ విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సుధా కళ్యాణి, హారిక విజేతలుగా నిలిచారు. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులోని జార్జ్‌ కారొనేషన్‌lక్లబ్‌లోని వర్రా గురివిరెడ్డి ఇండోర్‌ స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఈ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. పోటీలలో గెలుపొందిన విజేతలకు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ మెడల్స్, షీల్డ్‌లు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బ్యాడ్మిం టన్‌ అభివృద్ధికి అకాడమీలను నెలకొల్పుతామని చెప్పారు. 
 
>
మరిన్ని వార్తలు