'బాక్సైట్ ఒప్పందాలు రద్దు చేయాలి'

17 Aug, 2015 12:26 IST|Sakshi

విశాఖపట్టణం: బాక్సైట్ ఒప్పందాలు రద్దు చేయాలని సీపీఎం ఎంపీ జితేందర్ చౌదరి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియతో మాట్లాడారు. బాక్సైట్ ఒప్పందాల్లో జరిగిన అవినీతి ఒప్పందాలపై 2002 సెప్టెంబరులోనే గిరిజన మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశారు. అయినా ప్రభుత్వాలు నేటికీ రద్దు చేయకపోవడం దుర్మార్గమన్నారు. బాక్సైట్ ఒప్పందాలు రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని జితేందర్ చౌదరి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు