కిరోసీన్ మారుతోంది

18 Nov, 2016 03:16 IST|Sakshi
కిరోసీన్ మారుతోంది

నల్లబజారుకు తరలుతున్న బ్లూ కిరోసిన్
చాకచక్యంగా దోపిడీ చేస్తున్న డీలర్లు
లీటర్ కిరోసిన్ రూ.30 వరకు విక్రయం
కన్నెత్తి చూడని అధికార గణం
లబోదిబోమంటున్న కార్డుదారులు

పేదలకు అందాల్సిన సబ్సిడీ కిరోసిన్ చౌకదుకాణాల డీలర్ల చేతివాటంతో యథేచ్ఛగా నల్లబజారుకు తరలుతోంది. లీటరు కిరోసిన్ రూ.30 వరకు విక్రరుుంచి జేబులు నింపుకుంటున్నారు. దీనిపై ప్రశ్నించిన కార్డుదారులపై కొందరు డీలర్లు భౌతిక దాడులకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరించడం గమనార్హం.

చిత్తూరు (కలెక్టరేట్):  జిల్లాలో మొత్తం 10,27,892 కుటుంబాలకు తెల్లరేషన్ కార్డులు ఉన్నారుు. ప్రతినెలా ప్రభుత్వం చౌకదుకాణాల ద్వారా సబ్సిడీపై 11.4 లక్షల లీటర్ల మేరకు కిరోసిన్ పంపిణీ చేస్తోంది. గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలకు లీటరు రూ.15 చొప్పున, గ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబాలకు లీటరుకు రూ.4 చొప్పున పెంపుదల చేసి రూ.19 మేరకు విక్రరుుస్తున్నారు. ఈ విధానాన్ని ఈ నెల కోటా నుంచి అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్లు ఉన్న 6,95,188 కుటుంబాలకు పెంపుదల చేసిన రేట్లు వర్తిస్తారుు.

ఇలా దోపిడీ
సబ్సిడీ కిరోసిన్‌ను చౌకదుకాణాల ద్వారా ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు కార్డుదారులకు పంపిణీ చేయాలి. బియ్యం, చక్కెర, వివిధ సరుకులతోపాటు కిరోసిన్‌నూ డీలర్లు ఒకేసారి అందించాలి. అరుుతే కొందరు డీలర్లు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రేషన్ సరుకులు అందించే సమయంలో కిరోసిన్ ఇవ్వడం లేదు. ఇదేమని లబ్ధిదారులు ప్రశ్నిస్తే ‘కిరోసిన్ ఇవ్వడం వల్ల చేతు లు పాడవుతారుు, అదే చేతులతో రేషన్ సరుకులు ఇవ్వడం వల్ల అవికూడా కిరోసిన్ వాసన వస్తా రుు, వారం తరువాత రండి’.. అంటూ బోల్తాకొట్టిస్తున్నారు. బయోమెట్రిక్ విధానంలో కిరోసిన్ ఇచ్చినట్లు వేలిముద్రలు వేసి తిప్పి పంపుతున్నారు. తీరా వారం తర్వాత వచ్చినాలబ్ధిదారులకు కిరోసిన్ ఇవ్వడంలేదు. టైం అరుుపోరుుందంటూ బుకారుుస్తున్నారు. గట్టిగా నిలదీస్తే ‘అధికార’ అండదండలు చూసుకుని కొందరు భౌతిక దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.

పుట్టగొడుగుల్లా ఏజెంట్లు
సబ్సిడీ కిరోసిన్‌ను నల్ల బజారులో విక్రరుుంచేందకు ఏజెంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాల్లోని ప్రొవిజన్ షాపులు, చిల్లర దుకాణాలను వారు ఆవాసంగా చేసుకుంటున్నట్టు  తెలుస్తోంది. డీలర్లు దోపిడీ చేసిన కిరోసిన్‌ను గుట్టుచప్పుడు కాకుండా రాత్రిపూట ఏజెంట్లకు తరలిస్తున్నారు. వారి వద్ద రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు. ఏజెంట్లు సేకరించిన కిరోసిన్‌ను  లారీ డ్రైవర్లు, ఫ్యాక్టరీలకు రూ.40 చొప్పున విక్రరుుస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ లేమి
చౌకదుకాణాల్లో రేషన్, కిరోసిన్ పంపిణీపై ఎప్పటికప్పుడు పౌరసరఫరాలశాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలి. అరుుతే సంబంధిత అధికారులు చౌకదుకాణాలకు వెళ్లిన దాఖలాలు లేవు. దీంతో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నారుు.

కిరోసిన్ ఇవ్వడంలేదు
ప్రతినెలా 1 నుంచి 15 తేదీ వరకు రేషన్ మాత్రం ఇస్తున్నారు. కిరోసిన్ ఇవ్వడంలేదు. డీలర్‌ను ప్రశ్నిస్తే మేము ఉన్నప్పుడు వస్తే ఇస్తాం, లేదంటే ఇవ్వడం కుదరదని చెబుతున్నారు. - అశ్విని, గిరింపేట, చిత్తూరు

మరిన్ని వార్తలు