యాచకుడి అనుమానాస్పద మృతి

2 Jul, 2017 23:24 IST|Sakshi

ధర్మవరం అర్బన్ : పట్టణంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ యాచకుడు (75) ఆదివారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. తలకు రాయితో కొట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతుడి వివరాలు పూర్తిగా తెలియరాలేదు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు