బీచ్‌లో గల్లంతైన బెంగళూరు యువకుడు మృతి

14 Oct, 2016 02:02 IST|Sakshi
బీచ్‌లో గల్లంతైన బెంగళూరు యువకుడు మృతి
తోటపల్లిగూడూరు : కోడూరు బీచ్‌లో బుధవారం సాయంత్రం గల్లంతైన బెంగళూరుకు చెందిన యువకుడు ఫైరాజ్‌ (22) మృతి చెందాడు.  బెంగళూరుకు చెందిన ఫైరాజ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగకు వచ్చాడు. బుధవారం రొట్టెల పండగలో పాల్గొని సాయంత్రం కోడూరు బీచ్‌కు వచ్చారు. సముద్రస్నానాలు చేస్తున్న సమయంలో ఫైరాజ్‌ అలల తాకిడితో సముద్రంలో గల్లంతయ్యాడు. దీంతో పోలీసులు, యువకుడి కుటుంబ సభ్యులు రాత్రి 9.30 గంటల వరకు  గాలించినా అతని ఆచూకీ తెలియరాలేదు. బుధవారం సాయంత్రం సముద్రంలో గల్లంతైన యువకుడు ఫైరాజ్‌ మృతదేహం గురువారం ఉదయం బీచ్‌లోని జెట్టీల వద్దకు కొట్టుకువచ్చింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 
 
 
>
మరిన్ని వార్తలు