అధికారులకు ప్రశంసాపత్రాలు

16 Aug, 2016 22:54 IST|Sakshi
ప్రశంసాపత్రాన్ని అందుకుంటున్న రామాయంపేట ఎంపీడీవో రాణి

రామాయంపేట: ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా సోమవారం జిల్లా మంత్రి హరీశ్‌రావుతోపాటు జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాజమణి చేతులమీదుగా ఎంపీడీవో రాణి, మండల వ్యవసాయ అధికారి రమేశ్‌, ఐసీడీఎస్‌ సీడీపీవో జ్యోతిర్మయి. స్థానిక ఎంపీపీ సూపరిండెంట్‌ గఫూర్‌ఖాన్ ప్రశాంసాపత్రాలను అందుకున్నారు. మండలానికి చెందిన అధికారులు సన్మానం పొందడంపై ఆయా పార్టీల ప్రతినిధులతోపాటు అధికారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

 

మరిన్ని వార్తలు