కర్నూలు వాసికి ఉత్తమ మేకప్‌మెన్‌ అవార్డు

1 May, 2017 00:12 IST|Sakshi
కర్నూలు వాసికి ఉత్తమ మేకప్‌మెన్‌ అవార్డు
కర్నూలు (అగ్రికల్చర్‌) : కర్నూలు వాసికి ఉత్తమ మేకప్‌మెన్‌గా అవార్డు లభించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో నంది నాటకోత్సవాలు జరిగాయి. పద్య, నాటక విభాగంలో శ్రీకృష్ణ భీమసేనం నాటకానికి సంబంధించి కర్నూలుకు చెందిన చింత శ్రీనివాసులుకు ఉత్తమ మేకప్‌మెన్‌గా నంది అవార్డు లభించింది. కర్నూలు అభిఆర్ట్స్‌కు చెందిన చింతా శ్రీనివాసులు ఇదివరకే ఐదు అవార్డులు దక్కించుకున్నారు. తాజాగా మరో అవార్డు దక్కడం విశేషం. కర్నూలు వాసికి అత్యుత్తమమైన అవార్డు దక్కడంపై కళాకారులు అభినందనలు తెలిపారు.
 
మరిన్ని వార్తలు