ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుల ఎంపిక

10 Sep, 2016 22:01 IST|Sakshi
మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాలో ఎనిమిది మంది ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులను ఎంపికచేసినట్లు వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం జిల్లాశాఖ అధ్యక్ష, కార్యదర్శులు జగన్‌మోహన్‌గౌడ్, రాజవర్ధన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో యూ.శ్రీనివాసులు (మహబూబ్‌నగర్‌), సురేందర్‌రెడ్డి (వనపర్తి), జితేందర్‌ (మల్దకల్‌), ఎజ్కెల్‌ (మామిడిపల్లి), యాదయ్యగౌడ్‌ (కల్వకుర్తి), ఆంజనేయులు (జక్లెర్‌), మెర్సి ఫ్రెంచ్‌ (బాదేపల్లి), వి.శ్రీనివాసులు (అలంపూర్‌)లను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.  వీరికి ఈనెల 12న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించనున్న కార్యక్రమంలో సన్మానం చేయనున్నట్లు వారు తెలిపారు.
 
మరిన్ని వార్తలు