కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఏసీబీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మానాయక్కు రాష్ట్ర ప్రభుత్వం మహోన్నత సేవా పథకాన్ని ప్రకటించింది. బుధవారం గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ఆయన పథకాన్ని అందుకోనున్నారు. ఓర్వకల్ మండలం గుమితంతండా గ్రామంలోని సామాన్య రైతు కుటుంబం నుంచి 1995లో ఎస్ఐగా పోలీసు శాఖలో చేరిన లక్ష్మా నాయక్ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ఏసీబీ జేడీగా పనిచేస్తున్నారు.