-
జిల్లావ్యాప్తంగా 90 మంది ఎంపిక
కరీంనగర్ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ఈ 8న టీఎన్జీఓ ఫంక్షన్హాల్లో సాయంత్రం 5గంటలకు ప్రదానం చేయనున్నట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాసాచారి తెలిపారు. విద్యాశాఖలోని వివిధ కేటగిరీల్లో 90 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. వీరిని ఘనంగా సత్కరించి అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యాభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.