భక్త జన సంద్రం

16 Apr, 2017 00:19 IST|Sakshi
భక్త జన సంద్రం
మొగల్తూరు: పేరుపాలెం బీచ్‌లో వేంచేసియున్న వేళాంకిణిమాతను దర్శించుకునేందుకు శనివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చారు. గుడ్‌ఫ్రైడే పురస్కరించుకుని 40 రోజులు ముందుగా ప్రత్యేక మాల ధరించిన విశ్వాసులు శుక్రవారం రాత్రి బీచ్‌కు చేరుకున్నారు. శనివారం వేకువ జామున సముద్ర స్నానం ఆచరించి తలనీలాలు సమర్పించుకొని వేళాంకిణి మాతను దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్చి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
 
 
 
మరిన్ని వార్తలు