జాతీయస్థాయి పోటీలకు భార్గవ్‌

26 Dec, 2016 22:15 IST|Sakshi
అమలాపురం :
స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేష¯ŒS ఆఫ్‌ ఇండియా (ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగే సపక్‌తక్రా అండర్‌–14 పోటీలకు అమలాపురం రవీంద్రభారతి స్కూల్‌కు చెందిన జి.భార్గవ్‌ ఎంపికయ్యాడు. పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోన్న భార్గవ్‌ ఈనెల 23, 24 తేదీల్లో నెల్లూరులో రాష్ట్రస్థాయి సపక్‌తక్రా పోటీల్లో ప్రతిభ చూపి జాతీయ పోటీల రాష్ట్రజట్టుకు ఎంపికైనట్టు కోచ్‌ యాండ్ర గౌతమ్‌ సోమవారం తెలిపారు. జనవరి మూడో తేదీ నుంచి ఆరోతేదీ వరకు ఢిల్లీలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు.  
 
మరిన్ని వార్తలు