నాగాపూర్లో ముగిసిన తంతు
రూ.2 లక్షలకు అభ్యర్థిత్వం ఖరారు
నిర్వహించారు. గ్రామ సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్కు రిజర్వు అయింది. శనివారం కుల సంఘం సభ్యులు సమావేశమై అభ్యర్థిని ఖరారు చేసేందుకు చర్చించారు. పోటీకి పలువురు అభ్యర్థులు ఆసక్తి చూపడంతో కుల సంఘం సభ్యులు వేలం పాట నిర్వహించారు. రాథోడ్ గంగాధర్ అనే వ్యక్తి రూ. 2.05 లక్షలకు వేలం పాడి సర్పంచ్ పదవి కోసం తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు నాగాపూర్ చేరుకొని సంఘ సభ్యులను విచారించారు. ప్రజాస్వామ్యం ప్రకారం ఎన్నికల్లో పోటీ ఎవరైనా చేయవచ్చని, వేలం పాట నిర్వహించవద్దని సూచించారు. కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.