నగరానికి భారీ అతిథి

19 Jul, 2016 22:13 IST|Sakshi
నగరానికి భారీ అతిథి

సాక్షి,సిటీ బ్యూరో: విశాఖపట్నం పోర్ట్‌ నుంచి భారీ విద్యుత్‌ యంత్రాలతో నాగపూర్‌ బయలుదేరిన 268 టైర్ల అతిపెద్ద వాహనం మంగళవారం నగర శివారులో ఆగిపోయింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద ఘాట్‌ రోడ్డులో ప్రయాణిస్తుండగా ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రోడ్డు మధ్యలోనే వాహనం ఆగిపోయింది. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారి కావడంతో వెనుక వచ్చిన వాహనాలు ఎటూ పోయే మార్గం లేక భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 30 మంది పర్యవేక్షకులు వెంటనే రంగంలోకి దిగి మరమ్మతు పనులు చేపట్టారు. ఈ భారీ వాహనం మరో 30 రోజుల్లో నాగ్‌పూర్‌కు చేరుకుంటుందని జేఎం బాక్సి గ్రూప్‌ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.   

                                                                        – ఫొటోలు: సోమ సుభాష్‌

                                                                  

వాహనం నిలిచిపోవడంతో స్థంబించిన ట్రాఫిక్

 

మరిన్ని వార్తలు