బైక్-డీసీఎం ఢీ, ఇద్దరి మృతి

19 Jul, 2016 14:08 IST|Sakshi

నార్కట్‌పల్లి: నల్గొండ జిల్లాలోని మండల కేంద్ర శివారులో మంగళవారం మధ్యాహ్నం డీసీఎం- బైక్ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు