డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి

17 May, 2016 09:48 IST|Sakshi

మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ చౌరస్తా సమీపంలోని హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై డివైడర్‌ను బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన ఉమామహేశ్వర్(35) మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు