గుంటూరు (నెహ్రూనగర్): పల్స్ సర్వే వి«ధులు సక్రమంగా నిర్వహించనందుకుగాను నగరపాలక సంస్థలో బిల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఎం.మాధవ్ను సస్పెండ్ చేస్తూ సోమవారం నగర కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నాటికి పల్స్ సర్వే గడువు ముగుస్తున్న నేప«థ్యంలో సర్వే వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వి«ధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రోజు 25 ఇళ్లు తగ్గకుండా సర్వే చేయాలని, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహిస్తున్నది, లేనిది సూపర్వైజర్లు పర్యవేక్షణ చేయాలన్నారు.