11న బీజేపీ బీసీ మోర్చా సమావేశం

2 Sep, 2016 23:08 IST|Sakshi
11న బీజేపీ బీసీ మోర్చా సమావేశం
నల్లగొండ టూటౌన్‌ : ఈనెల 11వ తేదీన బీజేపీ బీసీ మోర్చా జిల్లా సమావేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు పార్టీ బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి ధనుంజయ్య తెలిపారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ర్యాలీలు, ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానం చేయడంతో పాటు అమరులను సత్కరిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, గుండెబోయిన మల్లయ్య యాదవ్, శ్రీరామోజు షణ్ముఖ చారి, పల్లెబోయిన శ్యాంసుందర్, పోతెపాక సాంభయ్య, పెరిక మునికుమార్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు