శ్రీశైలం డ్యాంలో 854 అడుగులు నీరు ఉంచాలి

2 Oct, 2015 18:41 IST|Sakshi

శ్రీశైలం : శ్రీశైలం డ్యాంలో 854 అడుగులు నీరు ఉండేలా జీఓ విడుదల చేయాలని బీజెపీ రాష్ట్ర నాయకులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం డ్యాం వద్ద బీజేపీ నాయకులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి రైతులు సత్యాగ్రహం చేశారు.

ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ... అత్యంత కరువు పీడిత ప్రాంతంగా ఉన్న రాయలసీమను ఆదుకోవాలంటే శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల కనీస నీటిమట్టాన్ని ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీశైలంలో నీటిమట్టం డెడ్‌స్టోరేజి దశలో ఉన్నా అటు తెలంగాణా, ఇటు ఆంధ్ర ప్రాంతానికి నీటిని విడుదల చేయాలని కృష్ణాబోర్డు ఆదేశాలు జారీ చేయడం సిగ్గుచేటు అని రాంభూపాల్ రెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు