చిత్తూరు కోర్టు ఆవరణలో బాంబు పేలుడు

7 Apr, 2016 12:48 IST|Sakshi
చిత్తూరు కోర్టు ఆవరణలో బాంబు పేలుడు

చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం మధ్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన బాలాజీ నాయుడు(36) అనే గుమాస్తాను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పేలుడు దాటికి పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పార్క్ చేసి ఉంచిన స్కూటర్ డిక్కీలో ఈ బాంబు పెట్టినట్లు సమాచారం.

కాగా చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూను విచారణలో భాగంగా పోలీసులు ఈ రోజు కోర్టుకు తీసుకువచ్చారు. ఆ సమయంలోనే పేలుడు జరిగింది. దీంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు  కోర్టు ప్రాంగణం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు