పవిత్ర కృష్ణవేణీ ఒడిలో పుణ్య స్నానమాచరించేందుకు చిన్నా, పెద్దాతో పాటు దివ్యాంగులు కూడా తరలివస్తున్నారు. గుంటూరు కళాభారతి అంధుల పాఠశాల విద్యార్థులు సుమారు 50 మంది ఆదివారం అమరావతిలోని ధ్యానబుద్ధ ఘాట్లో పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చారు. అంధ విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసుకుని స్నానానికి వెళ్లిన తీరును భక్తులు అభినందించారు.
- పట్నంబజారు (అమరావతి)