సుందర సత్సంగం సభ్యుల రక్తదానం

18 Jul, 2016 17:26 IST|Sakshi
సుందర సత్సంగం సభ్యుల రక్తదానం
శ్రీకాకుళం కల్చరల్‌: నగరంలో కొన్నేళ్లుగా వేద విద్య, పూజాదికాలు నేర్పుతున్న గురువుకు నేటి సమాజానికి ఉపయోగపడే విధంగా గురుదక్షిణగా పురుపౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక వైశ్యాబ్యాంకు కాలనీలోని సుందర సత్సంగం ఆధ్వర్యంలో 170 మంది శిషు్యలు రక్తదానం చేశారు. ఇందులో మహిళలే అధికంగా ఉన్నారు. మొదటిగా గురువైన శ్రీపెరుంబుదూరు సూరిబాబు రక్తదానం చేశారు. ఎనిమిదేళ్లుగా శిషు్యలు గురుదక్షిణగా రక్తదానం చేస్తున్నారు. శిబిరాన్ని కలెక్టర్‌ డాక్టర్‌ పి.లక్ష్మీనసింహం సందర్శించి మంచి కార్యక్రమం చేస్తున్నారని అభినందించారు. ఈ సందర్భ ంగా సూరిబాబు మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవగా తమ శిషు్యలు చేపట్టిన కార్యక్రమం ఎంతో గొప్పదన్నారు. ఎక్కువగా మహిళలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం ఆనందకరమైన విషయమని చెప్పారు. సామాజిక సేవే పరమావధిగా శిషు్యలు ఎదగాలని కోరారు. అంతకుముందు సూరిబాబుకు శిషు్యలు పాద పూజ చేశారు.  కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోçßæనరావు, వైద్యాధికారి సత్యవతి, సుందర సత్సంగం సభ్యులు కేవీ అప్పలనాయుడు, కె.లక్షీ్మనారాయణ, పి.అప్పలరాజు, ప్రసాద్, డాక్టర్‌ రవికుమార్, విజయలక్ష్మీ, యామిని, పి.చైతన్యకుమార్, డాక్టర్‌ ఎన్‌.అప్పన్న, నిక్కు హరిసత్యనారాయణ, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు