-
నేరేడుగొండ : ఆదిలాబాద్ జిల్లా బోధ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్ పర్సన్గా నల్ల శారద, వైస్చైర్మన్గా భోజన్న బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి అటవీ, పర్యావరణ శాఖల మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ పాల్గొన్నారు. నల్ల శారద, భోజన్నకు మంత్రి, ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.