కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం

4 Aug, 2015 17:57 IST|Sakshi

నిర్మల్: ఆదిలాబాద్ లోని నిర్మల్ కోర్టుకు బాంబు బెదిరింపుల నేపథ్యంలో కలకలం రేపింది. కోర్టు, ఆవరణ ప్రాంగణాల్లో బాంబులు పెట్టినట్లు ఓ ఆకతాయి అధికారులకు మంగళవారం సాయంత్రం ఫ్యాక్స్ పంపించాడు. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించిన అధికారులు బాంబ్ స్క్వాడ్ ను కోర్టు వద్దకు పిలిపించారు. ప్రస్తుతం బాంబ్ స్క్యాడ్ అక్కడ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ ఎటువంటి బాంబులు లభ్యమవ్వలేదని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు