ధర్మవరం టౌన్ : ధర్మవరం కోర్టు ప్రాంగణంలో బాంబు ఉందంటూ వచ్చిన వదంతులతో కలకలం రేగింది. దేశంలో బాంబుదాడులు చేస్తామన్న ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో బుధవారం న్యాయమూర్తుల అనుమతితో డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ హరినాథ్, ఎస్ఐ గణేష్ సిబ్బందితో కలసి కోర్టు పరిసర ప్రాంతాలు, కోర్టు హాలులో సోదాలు నిర్వహించారు.
ఈ నేఫథ్యంలో అక్కడున్న పలువురు న్యాయవాదులు, కక్షిదారులు కోర్టులో బాంబు పెట్టారని వదంతులు వ్యాపింపజేయడంతో కాస్తంత గందర గోళం నెలకొంది. చివరికి పోలీసులు ఇవి సాధారణ సోదాలు మాత్రమేనని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.