విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

21 Aug, 2016 22:47 IST|Sakshi

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : దివాకర్‌ సోషల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆ« ద్వర్యంలో స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జర్నలిస్టుల పిల్లలకు పాఠ్య, నోట్‌ పుస్తకాలను పంపి ణీ చేశారు. కార్యక్రమం లో  ఏపీ డబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. వీటి పరిష్కారానికి మీడియో ఉద్యోగులు సమైక్య పోరాటం చేయాల్సి ఉందన్నారు.

ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు జేసీ పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సాక్షి దినపత్రిక బ్రాంచ్‌ మేనేజర్‌ కేదార్‌నాథ్‌రెడ్డి, మీడియా ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శివానంద, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు సనప రామకృష్ణ, జయరాం, ఎలక్ట్రానిక్‌ మీడియా అధ్యక్షుడు రసూల్‌   పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు