నీటికుంటలో పడి చిన్నారి మృతి

28 Sep, 2016 00:49 IST|Sakshi
కొత్తపల్లి:  లింగాపురం గ్రామంలో రెండేళ్ల చిన్నారి ప్రమాదశాత్తు నీటి కుంటలో పడి మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన సువార్తయ్య, శ్యామలమ్మ దంపతుల కుమారుడు దేవదాసు (20) చిన్నారులతో కలసి ఇంటి సమీపంలో సెంటర్‌ చర్చి దగ్గర ఆడుకుంటున్నాడు. దేవదాస్తు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న నీటి కుంటలో పడ్డాడు. చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారి వచ్చి బయటకు తీసేలోగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శివశంకర్‌ నాయక్‌ గ్రామానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లుస్‌ఐ తెలిపారు.    
 
>
మరిన్ని వార్తలు