బందరు కాలువకు గండి

21 Aug, 2016 19:16 IST|Sakshi

 - నీట మునిగిన వేలాది ఎకరాలు
కంకిపాడు(కృష్ణాజిల్లా)

 కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం ఈరంకి వద్ద ఉన్న బందరు కాలువకు ఆదివారం మధ్యాహ్నం గండిపడింది. కాల్వ కట్ట కూడా కొతకు గురైంది. భలితంగా నీళ్లు వృధాగా పోతూ కాలువ ఆయకట్టు కింద ఉన్న వేలాది ఎకరాలను ముంచెత్తుతోంది. ఒక్కసారిగా కాలువకు గండి పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట నీటి పాలైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుగల అధికారులెవరూ ఇంతవరకూ సంఘటన స్థలానికి రాలేదని రైతులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు