గుండాలతండ(తుగ్గలి): నవ వధువు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మండలంలోని గుండాల తండాలో చోటు చేసుకుంది. జొన్నగిరి హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. ఎల్లమ్మగుట్టతండాకు చెందిన పార్వతీ బాయి(18)కి గుండాల తండా వెంకటేష్నాయక్తో ఐదు నెలల క్రితం వివాహం జరిగింది. వెంకటేష్నాయక్ రాజంపేటలో కూలీ పనులు చేసుకుంటూ ఉండేవాడు.
అనారోగ్యంతో బాధపడుతున్న పార్వతీబాయిని చికిత్స నిమిత్తం సోదరుడు రమేష్నాయక్ అనంతపురం జిల్లా గుత్తికి తీసుకెళ్లి చూపించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు హైదరాబాద్కు తీసుకెళ్లాలంటూ సూచించారు. ఇంటికి వచ్చిన రమేష్నాయక్ తన సోదరిని బుధవారం భర్త ఇంటి వద్ద దింపి వచ్చాడు. అక్కడ ఏమి జరిగిందో ఏమో కాని పార్వతీబాయి మృతి చెందింది. మృతదేహానికి గురువారం పత్తికొండలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి సోదరుడు రమేష్నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్వతిబాయి మతిపై తండావాసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.