వాహనం ఢీకొని అన్నదమ్ములు మృతి

19 Jul, 2016 11:10 IST|Sakshi

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం ఎం నాగులపల్లి జాతీయ రహదారిపై మంగళవారం బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములు  మరణించారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు