కర్నూలు (ఓల్డ్సిటీ): పాత రూ. 500 నోటుతో బీఎస్ఎన్ఎల్ అమూల్యప్లాన్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు సంస్థ జీఎం పి.శామ్యూల్ జాన్ వెల్లడించారు. ఈ ప్లాన్ తీసుకున్న వారికి రూ. 500 విలువ చేసే టాక్ టైమ్ కూడా ఉచితంగా ఇస్తామని శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ ఆఫర్ ఈనెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.