పాత రూ. 500 నోటుతో బీఎస్‌ఎన్‌ఎల్‌ అమూల్య ప్లాన్‌

12 Dec, 2016 15:18 IST|Sakshi
 కర్నూలు (ఓల్డ్‌సిటీ): పాత రూ. 500 నోటుతో బీఎస్‌ఎన్‌ఎల్‌ అమూల్యప్లాన్‌ కనెక‌్షన్‌ ఇవ్వనున్నట్లు సంస్థ జీఎం పి.శామ్యూల్‌ జాన్‌ వెల్లడించారు.  ఈ ప్లాన్‌ తీసుకున్న వారికి రూ. 500 విలువ చేసే టాక్‌ టైమ్‌ కూడా ఉచితంగా ఇస్తామని  శనివారం  ప్రకటనలో తెలిపారు. ఈ ఆఫర్‌ ఈనెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
 
మరిన్ని వార్తలు