బీటెక్ బాబు ఎన్ని సిగరెట్లు దొంగలించాడో?

20 Jul, 2016 19:47 IST|Sakshi

బంజారాహిల్స్‌: జల్సాలకు అలవాటుపడ్డ ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి స్నేహితుడితో కలిసి దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి కటకటాలయ్యాడు. షాద్‌నగర్‌ విజయ్‌నగర్‌ కాలనీలో నివసించే బి.రఘు (21) చేవెళ్ల సమీపంలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ ఇతను కొంతకాలం షాద్‌నగర్‌కు చెందిన స్నేహితుడు ఎల్‌.నరేష్‌(20)తో చోరీలు చేస్తున్నాడు.  మూడు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10సిలోని గాయత్రిహిల్స్‌లో ఉన్న సాయి శ్రీనివాస కిరాణా స్టోర్‌కు వెళ్లి సిగరెట్‌ కావాలని అడిగాడు. వ్యాపారి అతడికి సిగరెట్టు ఇస్తున్న సమయంలోనే అక్కడున్న రూ. 10 వేల విలువ చేసే సిగరెట్ల డబ్బాను తస్కరించి బైక్‌పై ఉడాయించాడు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పక్కా నిఘా వేసిన పోలీసులు రఘుతో పాటు నరేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

అరెస్టయిన రఘు, నరేష్‌

                

మరిన్ని వార్తలు