తిరుమల ఘాట్‌రోడ్డులో బస్సును ఢీకొన్న కారు

3 Nov, 2016 09:39 IST|Sakshi

తిరుమల: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహానాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తిరుమల రెండో కనుమ రహదారిలోని 12వ మలుపు వద్ద గురువారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.

దీంతో కారులో ఉన్న ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వారు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.

>
మరిన్ని వార్తలు