'ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం'

16 Oct, 2016 14:30 IST|Sakshi

జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ చెప్పారు. ఆదివారం ఆయన జగిత్యాలలో బస్‌ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.  తెలంగాణలో 1157 కొత్త బస్సులు, 157 మినీ ఏసీ బస్సులను కొనుగోలు చేయనున్నట్టు సోమారపు సత్యనారాయణ తెలిపారు.

మరిన్ని వార్తలు