20 కిలోల గంజాయి పట్టివేత

2 Jul, 2017 00:06 IST|Sakshi

గంజాయి ముఠా నేతల అరెస్ట్‌

ఓడీ చెరువు (పుట్టపర్తి) : గంజాయి ముఠాకు చెందిన ప్రధాన నాయకులను ఓడీ చెరువు మండలం గౌరాపురం క్రాస్‌ వద్ద పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌చార్జ్‌ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ సత్యనారాయణ ప్రత్యేక నిఘా పెట్టి శనివారం సాయంత్రం వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 2 లక్షల విలువ కలిగిన 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు వివరాలను కదిరి డీఎస్పీ వెంకట రామాంజనేయులు ఓడీ చెరువు పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు వివరించారు. ఓడీ చెరువు మండలం వంచిరెడ్డిపల్లికి చెందిన మంకముతక నారాయణ, విశాఖ జిల్లా సంకడ మండలం గండెంపల్లికి చెందిన గొర్ల ఈశ్వర్‌తో కలిసి గంజాయిని అనంతపురం, కర్ణాటకలోని బాగేపల్లి, చిక్‌»బళ్లాపూర్, బెంగళూరుకు తరలించి విక్రయించేవారు. గత బుధవారం పట్టుబడ్డ కొందరు నిందితులు ఇచ్చిన సమాచారంతో లోతుగా దర్యాప్తు చేసి ప్రత్యేక నిఘా వేసి నారాయణ, గొర్ల ఈశ్వర్‌ను పట్టుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. 

>
మరిన్ని వార్తలు