సీఈపై దాడి కేసులో కారు స్వాధీనం

31 Jul, 2016 01:27 IST|Sakshi
మక్తల్‌ : నీటిపారుదలశాఖ సీఈ ఖగేందర్‌పై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఎంపీటీసీ మాజీ సభ్యుడు కోళ్ల వెంకటేష్‌కు చెందిన కారును స్వాధీనం చేసుకున్నట్టు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం మక్తల్‌ పట్టణంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈనెల 26వ తేదీ సాయంత్రం కోళ్ల వెంకటేష్‌ తన అనుచరులతో ఈ వాహనంలో వెళ్లి అధికారులపై దాడి చేకి పాల్పడ్డాడన్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిపై రౌడీషీట్‌తోపాటు అనుచరులు తిరుపతి నర్సిములు, కావలి శ్రీహరి, మహిపాల్‌రెడ్డి, నీలరెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు.  
 
 
 

 

మరిన్ని వార్తలు