విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్టోర్నమెంట్ ఈనెల 28,29వ తేదీల్లో జరగనుండగా విశాఖ జిల్లా నుంచి ర్యాకింగ్ ఆటగాళ్ళు పాల్గొనున్నారు. గుంటూర్ జిల్లా చిలకలూరిపేటలో పురుషుల,మహిళా విభాగాల్లో జరిగే ఈ టోర్నిలో రాష్ట్ర క్యారమ్ జట్టును ఎంపిక చేయనున్నామని ఆంధ్ర స్టేట్ క్యారమ్ సంఘం కార్యదర్శి నీరజ్కుమార్ తెలిపారు. రాష్ట్ర జట్టుగా ఆరుగురేసి క్రీడాకారుల్ని మెన్,వుమెన్ కాటగిరిల్లో ఎంపిక చేయనుండగా వారంతా ఈనెల 30,31వ తేదీల్లో జరిగే సౌత్జోన్ అహ్వాన ప్రై జ్మనీ టోర్నిలో పాల్గొనున్నారన్నారు. స్టేట్ టోర్నిలో విజేతలు పదిహేనువేలు, సౌత్జోన్ టోర్నిలో విజేతలకు 30వేల నగదు ప్రోత్సాహాకాల్ని అందుకోనున్నారు.