నెల్లూరు(స్టోన్హౌస్పేట) :బట్వాడిపాళెం సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో బుధవారం క్యారల్స్ను నిర్వహించారు. యేసుక్రీస్తు పుట్టిన రాత్రి దూతలు ఆ వార్తను ప్రపంచానికి చాటారని, అందుకు ప్రతీకగా గాయకబృందాలు క్రిస్మస్ పాటలు పాడుతూ క్రిస్మస్ సంబరాన్ని అందరికీ అందజేస్తారని సంఘ కార్యదర్శి దేవకుమార్ తెలిపారు. పాస్టర్ హరిపాల్, కోశాధికారి ప్రతాప్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.