అశ్వారావుపేట: మూడేళ్లుగా ప్రేమించిన ప్రియురాలిని పెళ్లికి నిరాకరించడంతో.. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ప్రియుడిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ బీ సురేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మండల పరిధిలోని జమ్మిగూడేనికి చెందిన రామలక్ష్మీ అనే యువతిని అదే గ్రామానికి చెందిన దాది ప్రసాదు మూడేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి, తీరా పేళ్లికి నిరాకరించడంతో బాధితురాలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ప్రసాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.