అయ్యన్నఅనుచరుడిపై కేసు నమోదు

4 Jan, 2016 11:29 IST|Sakshi
అయ్యన్నఅనుచరుడిపై కేసు నమోదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయ్యన్న పాత్రుడు అనుచరుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మంత్రికి సన్నిహితుడంటూ చెప్పుకుంటున్న స్వరూప్ అనే వ్యక్తి  స్ధానికంగా ఉండే బిల్డర్ వంశీ అనే వ్యక్తిని బెదిరించడంతో పాటు దాడి చేసి గాయపరిచాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాదితుని ఫిర్యాదు మేరకు పోలీసులు 448, 323, 506 సెక్షన్‌ల క్రింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 
మరిన్ని వార్తలు