అదృశ్యంపై కేసు నమోదు

5 Feb, 2017 00:06 IST|Sakshi
ఆత్మకూరు : ఆత్మకూరుకు చెందిన నారాయణస్వామి అనే యువకుడు అదృశ్యం కావడంపై శనివారం కేసు నమోదు చేసినట్లు స్థాణిక పోలీసులు తెలిపారు. పదిహేను రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అంతటా గాలించారన్నారు. అయితే అతని ఆచూకీ కనిపించకపోవడంతో చివరకు తమకు ఫిర్యాదు చేశారని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 
మరిన్ని వార్తలు