మహానాడులో కేటరింగ్‌ కార్మికుడు మృతి

26 May, 2016 19:46 IST|Sakshi

తిరుపతి: తిరుపతి మహానాడులో కేటరింగ్‌ కోసం వచ్చిన ఓ కార్మికుడు మృతిచెందాడు. మృతుడు హైదరాబాద్‌లోని మాసబ్‌ ట్యాంక్‌ వాసిగా గుర్తించారు. అమర్నాథ్‌ అనే వ్యక్తి గతకొంతకాలంగా విజయవాడలో కేటరింగ్‌ పనిచేస్తున్నాడు. తిరుపతిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో కేటరింగ్‌ చేయడానికి అక్కడి బృందంతో కలిసివచ్చాడు.

వంట పనుల్లో ఉండగా ఉన్నట్టుండి అమర్నాథ్‌ కుప్పకూలిపోయాడు. అతన్ని రుయా ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతిచెందినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు