కంటైనర్‌లో పశువుల రవాణా

12 Sep, 2016 01:42 IST|Sakshi
దేవరపల్లి : తుని నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా పశువులను తరలిస్తున్న కంటైనర్లను గో సంరక్షణ సమితి సభ్యులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. తుని నుంచి రెండు కంటైనర్‌ వాహనాల్లో సుమారు 90 పశువులను హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నట్లు మండలంలోని యాదవోలుకు చెందిన గో సంరక్షణ సమితి సభ్యులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన సభ్యులు ఆదివారం సాయంత్రం దేవరపల్లి వద్ద రెండు కంటైనర్‌ వాహనాలను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్సై సీహెచ్‌ ఆంజనేయులు వాహనాల్లోని పశువులను పరిశీలించారు. గో సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులకు అరెస్ట్‌ చేశామని ఎస్సై ఆంజనేయులు చెప్పారు. 
 
>
మరిన్ని వార్తలు