శ్రీవారి సేవలో ప్రముఖులు

4 Feb, 2016 12:12 IST|Sakshi

శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. పలు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో దేశానికి ప్రతినిధ్యం వహించిన వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ ఈ రోజు ఉదయం స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అనంతపురం రేంజ్ డీఐజీ సత్యనారాయణ, తెలంగాణ సీఐడీ అడిషనల్ డీజీ సత్యనారాయణ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి కూడా శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగత ఏర్పాట్లు చేసి పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు.
 

మరిన్ని వార్తలు