కేంద్రం పట్టించుకోవడం లేదు: చంద్రబాబు

29 Apr, 2016 16:20 IST|Sakshi

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్పై కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో శుక్రవారం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని చెప్పారు. ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని రూ. 15 వేల కోట్లు అడిగితే కేవలం రూ. 2,800 కోట్లే ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చడం లేదన్నారు.

మరిన్ని వార్తలు