సర్టిఫికెట్ల పరిశీలన తేదీ మార్పు

24 Jul, 2016 01:12 IST|Sakshi

బుక్కపట్నం : 2016 ఎల్పీ సెట్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన తేదీలో ప్రభుత్వం మార్పు చేసిందని డైట్‌ ప్రిన్సిపాల్‌ జనార్దన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా విద్యా శిక్షణ  సంస్థలో ఈనెల 26,27 తేదీల్లో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. అభ్యర్థులు ప్రొవిజనల్‌ అలాంట్‌మెంట్‌లోని ఒరిజి నల్, జిరాక్స్‌ సర్టిఫికెట్లు తీసుకురావాలని ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు. వచ్చే నెల 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు.
 

మరిన్ని వార్తలు