3.5 తులాల బంగారు గొలుసు అపహరణ
హైదరాబాద్సిటీ
ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మాధవ నగర్ కాలనీలో చైన్స్నాచింగ్ జరిగింది. గుర్తుతెలియని దుండగులు లక్ష్మమ్మ అనే వృద్ధురాలి మెడలోని 3.5 తులాల బంగారు గొలుసును తస్కరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.