మీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో చైన్స్నాచింగ్ చోటుచేసుకుంది. స్కూలు నుంచి కుమారుడిని తీసుకువస్తోన్న శిరీష అనే మహిళ మెడలోని గొలుసును గుర్తుతెలియని దుండగులు లాకె ్కళ్లారు. చోరీకి గురైన బంగారు గొలుసు రెండుతులాలు ఉంటుందని బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.